1000 Farmers May Contest In Nizamabad MP Seat | Oneindia Telugu

2019-02-27 873

Big S@@@@ to Nizamabad MP Kavitha. 1000 farmers may contest in parliamentary elections due to telangana and central government negligence.
#nizamabad
#loksabha
#farmers
#contest
#cmkcr
#protest
#kcr
#elections
#tealangana


దేశానికి అన్నం పెట్టే రైతన్నలు కన్నెర్రజేస్తే ఏవిధంగా ఉంటుందో తెలుసా? మద్దతు ధర కోసం రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోకుంటే ఎట్లుంటుందో తెలుసా? ఇలాంటి ప్రశ్నలకు నిజామాబాద్ జిల్లా రైతులు తీసుకున్న నిర్ణయం సరైన సమాధానంగా కనిపిస్తోంది. మద్దతు ధర కోసం పసుపు, ఎర్రజొన్న రైతులు గత కొద్దిరోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో నిజామాబాద్ పార్లమెంటరీ స్థానం నుంచి బరిలో నిలిచేందుకు వెయ్యి మంది రైతులు సన్నద్ధమవుతున్నారు. అన్నదాతలు తీసుకున్న ఈ నిర్ణయం.. స్థానిక ఎంపీ కల్వకుంట్ల కవితకు షాక్ గా పరిణమించింది.

Free Traffic Exchange